Auspicious day of Ram Navami .. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"
New Post has been published on https://teluguidol.com/auspicious-day-of-ram-navami/
Auspicious day of Ram Navami .. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"
Auspicious day of Ram Navami .. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు “శ్రీ రామ నవమి”
దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు “శ్రీ రామ నవమి”గా పూజలు జరుపుకుంటుంటాం.
దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. చూసేందుకు మనమే కాదు సకల దేవతలు దివి నుండి భువికి దిగివచ్చి కల్యాణ మహోత్సవాన్ని చూసి పులకించిపోతారట.
శ్రీరాముడు సత్యపాలకుడు,ధర్మాచరణం తప్పనివాడు,ఏకపత్నీ వ్రతుడు,పితృ,మాతృ,నిగ్రహం,సర్వ సద్గుణాలు మూర్తీభవించిన దయార్ధ హృదయుడు.అందుకే ప్రతి ఏటా భద్రాద్రిలో జరిగే సీతారామ కళ్యాణాన్ని చూసి తరించిన వారి జన్మ సార్థకం అవుతుందని భక్తుల విశ్వాసం.
శ్రీరాముడు మనిషిగానే పుట్టాడు, మనిషిగానే కష్టసుఖాలు అనుభవించాడు.. మరి రాముడు దేవుడెలా అయ్యాడు?
రాముడు.. దేవుడనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం.. రాముడు ఒక మనిషి. మనిషిగానే పుట్టాడు.. మనిషిగానే పెరిగాడు.. మనిషిగానే కష్ట సుఖాలన్నీ అనుభవించాడు. రాజుగా.. ప్రజల్ని పరిపాలించాడు. మరి.. మనందరికీ ఆదర్శప్రాయుడు ఎలా అయ్యాడు? పురుషోత్తముడిగా ఎలా మారాడు?
శ్రీరాముని జీవితం మొత్తం.. మానవులకు ఎన్నో విషయాలను నేర్పుతుంది. ఎప్పుడెలా ప్రవర్తించాలో తెలియజేస్తుంది. తోడబుట్టినవాళ్లతో ఎల మెలగాలో వివరిస్తుంది. ప్రజల మన్ననలు ఎలా పొందాలో స్పష్టం చేస్తుంది. క్షమాగుణం, ప్రశాంతత.. అలాగే సహనం విలువల గురించి తెలియజేస్తుంది. అవసరమైనప్పుడు.. ధైర్యంగా చెడుపై ఎలా పోరాటం జరపాలో తెలియజేస్తుంది. కులం, మతం లాంటి సామాజిక అడ్డుకట్టల్ని ఎలా అధిగమించాలో నేర్పుతుంది. స్నేహం విలువతో పాటు శత్రువుతో కూడా మిత్రుత్వం ఎలా పొందాలో వివరిస్తుంది శ్రీరాముని జీవనశైలి.
అందుకే.. శ్రీరామచంద్రమూర్తి పురుషోత్తముడిగా గుర్తింపు పొందాడు:
పంచేయాద్రిలపై పూర్తి నియంత్రణ కలిగిన వాడు.. శ్రీరాముడు.. ఆలోచనాపరుడు.. అహంకారం లేని వాడు.. శ్రీరాముడు.. ఆత్మశత్రువుని జయించేవాడు.. శ్రీరాముడు..అందుకే.. శ్రీరామచంద్రమూర్తి పురుషోత్తముడిగా గుర్తింపు పొందాడు. కామం, కోపం, అత్యాశ, అసూయ లాంటి అవలక్షణాలున్న రావణాసురిడిని వధించడం ద్వారా.. ఆ లక్షణాలన్నింటిని రాముడు వధించాడని అంటారు. శ్రీరాముని పాద స్పర్శతో.. మన నేల ధన్యమైందని చెబుతుంటారు.
తండ్రి మాట జవదాటలేదు, నిత్యం.. సత్యమే పలికాడు:
శ్రీరాముని గురించి తెలియనివారుండరు. తండ్రి మాట జవదాటడు. నిత్యం.. సత్యమే పలికేవాడు. హిందువులకే కాదు.. ఇతర మతాల వారికి కూడా శ్రీరాముని గొప్పతనం తెలిసే ఉంటుంది. ఆ అయోధ్య రాముడు.. కేవలం ఆధ్యాత్మిక, చారిత్రక మూర్తి మాత్రమే కాదు. మంచితనానికి, దయకి, నమ్మకానికి.. చిహ్నం లాంటివాడు. అందుకే.. శ్రీరాముడు ఆదర్శపురుడయ్యాడు.
రాముడి జీవితం ఈ ప్రపంచానికి ఓ మంచి పుస్తకంలాంటిది:
శ్రీరామచంద్రమూర్తి జీవితం మొత్తం.. ఈ ప్రపంచానికి ఓ మంచి పుస్తకంలాంటిది. మనిషిగా జన్మించాక.. అతని వ్యక్తిత్వం ఎలా ఉండాలి.. ఎలాంటి జీవితాన్ని గడపాలి.. బంధు, మిత్రులతో ఎలా వ్యవహరించాలి.. ప్రజలతో ఎలా మమేకమైపోవాలి.. కష్ట, సుఖాల్లో ఎలా ముందుకు సాగాలన్న వాటిని ఆచరించి.. చూపించిన వాడు శ్రీరాముడు.
ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అడవులకు:
తల్లిదండ్రుల గారాలపట్టీ అయిన శ్రీరాముడు.. 17 ఏళ్ల వయసులోనే విశ్వామిత్రుడి వెంట అడవులకు వెళ్లమంటే. మరో మాట మాట్లాడకుండా వెళ్లాడు. తల్లిదండ్రులను దైవంగా భావించటానికి.. ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు. పెళ్లి చేసుకున్న రెండు నెలలకే.. రాజుగా పట్టాభిషేకానికి ముహూర్తం దగ్గరపడగానే.. పద్నాలుగేళ్లు వనవాసం చేయమంటే.. ఒక్క నిమిషం ఆలోచించకుండా అడవులకు వెళ్లాడు శ్రీరామచంద్రప్రభువు. జననీ.. జన్మభూమిశ్చ.. స్వర్గాదపీ గరీయసీ.. అన్నది కూడా మన అయోధ్య రాముడే. కన్నతల్లి, జన్మభూమి.. స్వర్గంతో సమానమన్నాడు కాబట్టే.. రాముడు ఉత్తమ పురుషుడయ్యాడు.
రాముడు ఏకపత్నీవ్రతుడు:
ఒక అన్నగా.. తమ్ముళ్లపై అపారమైన ప్రేమను కురిపించాడు రాముడు. ఆయన తమ్ముళ్లు కూడా.. అన్న పట్ల అదే రకమైన ప్రేమతో ఉన్నారు. తల్లులు వేరైన��.. ఏనాడూ తమ్ముళ్లతో చిన్న గొడవ పడలేదు. శ్రీరాముని కాలంలో.. రాజులకు ఎంతోమంది భార్యలు ఉండేవారు. అలాంటి సమయంలో కూడా.. రాముడు ఏకపత్నీవ్రతుడిగా పేరు సంపాదించాడు. దాదాపు 11 వేల ఏళ్లు.. అయోధ్యను పరిపాలించిన శ్రీరామచంద్రప్రభువు.. సీతాదేవిని తప్ప మరో మహిళను వివాహమాడలేదు. ఆనాటి నుంచే.. ఒక భార్యను కలిగి ఉండాలనేది.. కట్టుబాటుగా మారింది. చాలా మంది.. రాముడే ఆదర్శంగా ఒకరినే వివాహమాడారు.
శ్రీరాముడు లోకారాధ్యుడు ఎందుకైనాడు? భగవంతుడనా? పురుషోత్తముడనా? ఎవరి విశ్వాసాలు వారివి. రెండూ సత్యాలే కావచ్చు. నమ్మినవారికి నమ్మినంత. నాణెమునకు బొమ్మా బొరుసు ఉన్నట్లే శ్రీరాముడిలో నారాయణతత్త్వముంది, నరతత్త్వము వుంది.
శ్రీరాముడు మాత్రం తను ఒక సాధారణ మానవుడిగానే గడిపాడనడంలో సందేహమేమాత్రమూ లేదు. రామో విగ్రహవాన్ ధర్మః- ‘రాముడు ధర్మము మూర్త్భీవించినవాడ’ని ఎలా చెప్తామో అతడొక ‘మూర్త్భీవించిన ఆదర్శము’ అని కూడ చెప్పాలి. రాముడు మానవమాత్రుడిగానే తన జీవితకాలంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకుంటూ సుఖదుఃఖానుభూతులను పొందుతూ ఒక ఆదర్శమయ జీవనాన్ని కొనసాగించాడు. జాతికి, మానవాళికి అదే ప్రేరణ. స్ఫూర్తి కూడా. అందుకే ఆయనొక ‘జాతీయ మహానాయకుడు’. డా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడ రాజ్యాంగ మూలప్రతిలో రామపట్ట్భాషేకము, రామసేతు వంటి చిత్రాలకు స్థానం కల్పించారు.
శ్రీరాముడు మర్యాదా పురుషోత్తముడు. దైవంగా భావించే ధార్మికులు, ఆధ్యాత్మికులు కూడ దీన్ని అంగీకరిస్తారు. ఏది ధర్మమో దానిని దైవంగా భావించడం హిందూ జీవన పద్ధతి. శ్రీరాముడు మానవుడే అనే విషయాన్ని నారద వాల్మీకులే స్పష్టం చేశారు. తన ఆశ్రమానికి నారదుడు వచ్చినపుడు వాల్మీకి ఆయనతో- ‘మీరు లోక సంచారం చేస్తుంటారు కదా! ఈ లోకంలో ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవంతుడు, సచ్చరిత్రుడు, సమర్థవంతుడు, సదా ప్రియదర్శనుడు, సర్వ ప్రాణికోటికి హితుడు, తేజోవంతుడు, జితక్రోధుడు, ధైర్యవంతుడు, దేవతలు కూడ భయపడే పరాక్రమవంతుడైన మానవుడెవడైనా ఉన్నాడా? ఉంటే తెలియజేయండి’ అని అడిగినపుడు-
బహవో దుర్లభాశ్ఛైవ యే త్వయా కీర్తితా గుణాః
ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనై శ్రుతాః అని..
ఇట్టి సద్గుణ సంపన్నుడైన మానవుడు లభించడం దుర్లభమే. కాని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన శ్రీరాముడు మాత్రం దీనికి మినహాయింపుగా- శ్రీరాముడనే రాకుమారుడు ఉన్నట్టుగా చెప్పాడు. దీనిని బట్టి రాముడు వేసిన ప్రతి అడుగులో ఒక మానవోత్తముడు గోచరిస్తాడు. అతనిని ఆశ్రయించిన సద్గుణ సంపద కారణంగా దైవత్వాన్ని కూడా దర్శించవచ్చు.
శ్రీరాముడు ప్రజాపతులతో, బ్రహ్మతో సమానుడే కాని ప్రజాపతి కాడు, బ్రహ్మకాడు అన్నాడు. శత్రువులను, దుర్మార్గులను చీల్చి చెండాడి జీవకోటిని, ధర్మాన్ని పరిరక్షిస్తాడు, తన ధర్మాన్ని ఆచరిస్తాడు. స్వజనులను రక్షిస్తాడు. వేదవేదాంగాల తత్వాన్నాకళింపు చేసుకొన్నాడు. ధనుర్విద్యలో నిష్ణాతుడు అని శ్రీరాముని గురించి చెప్పాడు. సమస్త సద్గుణములు రాముడి నాశ్రయించి యున్నాయని అర్థం. అందుకే ఆయన పురుషోత్తముడు, మానవోత్తముడు, నరోత్తముడు. రాముని మానవ జీవన విధానాన్ని, కార్యసాధకతను, ఆదర్శాన్ని అడుగడుగునా మనం గమనించవచ్చు.
శ్రీరాముడు దైవీశక్తి సంపన్నుడని రామాయణాది గ్రంథాలు వర్ణించినా రాముడెక్కడా తన జీవితంలో దైవీశక్తిని ఉపయోగించుకోలేదు. ఒక మానవుని వలె తన కాళ్ల మీద తాను నిలబడ్డాడు. తన భుజబలాన్ని, తన మేధస్సును, తన విద్యలను తాను నమ్ముకున్నాడు. 14 ఏళ్ల పాటు వనవాసమంతా కాలి నడకనే సాగింది. సీతానే్వషణ సుగ్రీవుని సహాయము, హనుమంతుని శక్తి సామర్థ్యములతోనే జరిగింది.
సముద్రమును దాటవలసి వచ్చినపుడు కూడా వానరుల సహాయంతో సేతువును నిర్మించి దానిమీదుగా లంకకు వెళ్లాడు తప్ప ఎక్కడా మహిమలను, మాయలను ఉపయోగించలేదు. రావణ వధానంతరం అయోధ్యకు బయలుదేరి గంధమాదన పర్వతం దగ్గర దిగి ఋషిమునుల ఆశీస్సులు పొందిన శ్రీరాముడు వేదవేదాంగ విద్యా సంపన్నుడు. పరమ శివభక్తుడైన రావణుని చంపినందువల్ల కలిగే పాపమునకు ప్రాయశ్చిత్తంగా రామేశ్వరంలో సైకత శివలింగ ప్రతిష్ఠ చేశాడు. యుద్ధంలో శత్రువును చంపితే పాపం కలుగదు. కాని రావణుడు పరమశివ భక్తుడనే భావనతో లోక కళ్యాణార్థం రాముడు శివలింగ ప్రతిష్ఠ చేశాడు. మానవుని హృదయంలో ఎన్ని ఆలోచనలు పరిభ్రమిస్తుంటాయో శ్రీరాముడి మనస్సులో గూడ అలాగే పరిభ్రమించడంతో అలా వ్యవహరించాడు. అవసరాన్ని బట్టి శక్తిని, యుక్తిని, మేధస్సును ఉపయోగించాడు.
శ్రీరామునికి గుడి కడుతున్నాం. కట్టాల్సిందే తప్పులేదు. ఎందుకు కట్టాలి? ఆయన సద్గుణములు, ఆదర్శము రాశిపోసిన మానవమూర్తి కాబట్టి. రామాలయం అనగానే రాముని మూర్తి, ఆయన గుణములు ప్రజల మనస్సులోకి రావాలి. అందుకోసం విగ్రహ ప్రతిష్ఠలు. గుడి గోపురాల నిర్మాణం చేయడం భారతీయ సంప్రదాయంగా నెలకొన్నది. దుష్టత్వానికి, దుర్మార్గానికి ప్రతీకలైన వాటికి ఈ భూమిమీద ఆదరణ లేదు. అలాగే ప్రపంచంలో ఏ దేశమూ చెడును ప్రోత్సహించకూడదు. పోషించకూడదు కూడ.
అయితే గుళ్లు, గోపురాలు కట్టి పూజలు చేస్తుంటే సరిపోదు. పూజ చేస్తున్న సమయంలో ఆ సద్గుణాలన్నీ మదిలో మెదులుతుండాలి. రామోభూత్వా రామం యజేత్. రాముడిని పూజిస్తున్నామంటే తాము కూడ అంతటి ఉన్నతులు కావడానికి ప్రయత్నించాలి. ప్రతి మనిషీ రాముడు కావాలి. ప్రతి అణువూ రామతత్త్వమే. అంటే ధర్మతత్త్వమే. మానవత్వమే ధర్మం. అదే దైవము. అదే భారతీయము. అదే హైందవము. సనాతనము కూడ.
రామ కళ్యాణము చేస్తున్నారు, చేయాలి. కళ్యాణము శుభప్రదము. సమాజానికి శుభం కలగాలనే ఆకాంక్షతో కళ్యాణం చేయాలి. శ్రీరాముడు ఏ భేదాలు, వైషమ్యాలు లేని సమరసతా, సమైక్యతా బాటలో నడిచి- మనకు బాట చూపించాడు. అంటరానితనం వంటి దురాచారాలను నిర్మూలించుకుంటూ, కుల విభేదాలను తొలగించుకుంటూ, సంపూర్ణ భారతీయ సమాజం సామూహికంగా రామకళ్యాణం జరుపుకోవడమే జాతికి శ్రేయస్సు.
Auspicious day of Ram Navami .. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు “శ్రీ రామ నవమి”
0 notes